రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో నగదును జగన్ జమచేయనున్నారు. లబ్దిదారులతో ఆయన ముఖాముఖిలో పాల్గొనున్నారు. అనంతరం గ్రామదర్శిని కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు.