Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

విద్యార్థుల భవిష్యత్తు కోసమే…

రాష్ట్రంలో పాఠశాలలకు సెలవుల కొనసాగింపుపై మంత్రి ఆదిమూలపు క్లారీటీ
కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ దృష్ట్యా వస్తున్న దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూనే పాఠ్యాంశాలను పూర్తిచేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సంక్రాంతి సెలవుల తర్వాత ఏపీలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. విద్యార్థుల రోజువారీ హాజరు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. పరీక్షలు నిర్వహించేలా పాఠశాలల్లో బోధన జరుగుతోందని వివరించారు. కొవిడ్‌ వల్ల రెండేళ్లుగా ఆల్‌ పాస్‌ విధానం అనుసరించామని, భవిష్యత్తులో విద్యార్థులకు ఇబ్బందుల దృష్ట్యా పాఠశాలలు తిరిగి ప్రారంభించినట్లు వివరించారు.. 26 లక్షల మంది విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని మంత్రి స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు కూడా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. కొవిడ్‌ దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూనే బోధన జరుగుతుందని, 150 రోజులు నిరంతరాయంగా పాఠశాలలు నడిచాయని వెల్లడిరచారు. విద్యా సంవత్సరం నష్టపోవద్దనే పాఠశాలల నిర్వహణ సాగిస్తున్నట్లు వివరించారు. కొవిడ్‌ వ్యాప్తికి పాఠశాలల నిర్వహణకు సంబంధం లేదన్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.అకడమిక్‌ ఇయర్‌ ని ముందుగా నిర్ణయుంచుకున్న ప్రకారం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి తెలిపారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని చర్యలు తీసుకుంటామన్నారు. . పొరుగు రాష్ట్రాలతో పోలిక అనవసరమని.. గతంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుగానే స్కూళ్లను ఆగస్టులోనే ప్రారంభించినట్లు మంత్రి గుర్తుచేశారు. ఏపీలో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు ఏ అంశమూ దొరక్క విద్యా వ్యవస్థ రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img