Friday, April 26, 2024
Friday, April 26, 2024

విభజన హామీలు నెరవేర్చని మోదీ గో బ్యాక్‌…

విశాలాంధ్ర- రాప్తాడు : ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుంచి విభజించిన ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చని నరేంద్ర మోడీ గో బ్యాక్‌ అంటూ సీపీిఐ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అనంతపురం జిల్లా రాప్తాడులో సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. సీపీిఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ తీవ్రమోసం చేశారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామని చెప్పి పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్‌ ప్లాంటును ప్రయివేట్‌ చేతుల్లో పెట్టేందుకు జెండా ఊపి నేడు విశాఖపట్నంకి ఎలా వస్తారని ప్రశ్నించారు. మోదీ పర్యటనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ స్వాగత ఏర్పాట్లు చేయడం అనైతికమన్నారు. ఏపీకి స్పష్టమైన హామీ ఇచ్చి వెనుదిరగాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శి సాకే నాగరాజు, మండల కార్యదర్శి ఆర్‌.రవీంద్ర, సహాయ కార్యదర్శి ఎం.చలపతి  వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరేంద్ర, నాయకులు మౌలాలి, బాషా,  రసూల్‌, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img