Friday, April 26, 2024
Friday, April 26, 2024

వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర : చంద్రబాబు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు కడప జైలులో ప్రాణహాని ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వారి హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలో మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు అనంతపురం జైలర్‌ గా ఉన్న వరుణ్‌ రెడ్డిని ప్రస్తుతం కడప జైలర్‌ గా నియమించారని వివరించారు. కడప జైలర్‌ గా వరుణ్‌ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి సాయంతో వరుణ్‌రెడ్డి ద్వారా వారికి ప్రాణహాని పొంచి ఉందన్నారు. శనివారం విజయవాడ పటమటలోని తమ పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, సీఐడీ అధికారులు అతిగా ప్రవర్తించారని మండిపడ్డారు. అశోక్‌ బాబుపై కక్షగట్టి కేసులు పెట్టారని ఆరోపించారు. ఇవాళ టీడీపీ శ్రేణులు బాధపడినట్టే, రేపు వైస్సార్సీపీ వాళ్లు కూడా బాధపడతారని, రేపన్నది ఒకటుంటుందని మరువరాదని హెచ్చరించారు.4 వేల మందిపై కేసులు పెట్టారని, ముగ్గురు మాజీ మంత్రులను, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను, బీటెక్‌ రవి వంటి వ్యక్తులను, నియోజకవర్గ ఇన్చార్జిలను 80 మందిని అరెస్ట్‌ చేశారని తెలిపారు. 33 మందిని పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారని అన్నారు.మూడేళ్లకే జగన్‌ కు అంతుంటే 14 ఏళ్లు చేసిన నాకెంత ఉండాలి? అని ఆగ్రహం వెలిబుచ్చారు. ‘సమస్యలు వీళ్లే సృష్టించి, వీళ్లే పరిష్కరించినట్టు నటించి అందరితో బలవంతంగా జేజేలు కొట్టించికుంటున్నారు అని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img