Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వెబ్‌సైట్‌లో జీవోలను ఎందుకు పెట్టట్లేదు : హైకోర్టు

వెబ్‌సైట్‌లో జీవోలను ఉంచకపోవడంపై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జీవోఐఆర్టీ వెబ్‌సైట్‌లో జీవోలు ఎందుకు పెట్టట్లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫీగా జరిగిపోయే ప్రక్రియకు ఆటంకం కల్పించడంపై సీరియస్‌ అయింది. విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసే జీవోల్లో ఐదు శాతం మాత్రమే వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 4 ఎనిమిదిలకు విరుద్ధమని అన్నారు. టాప్‌ సీక్రెట్‌ జీవోలు అప్‌లోడ్‌ చేయట్లేదని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. జీవోలు సీక్రెట్‌, టాప్‌ సీక్రెట్‌ అని ఎలా నిర్ణయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఎన్ని జీవోలు విడుదల చేసింది.. ఎన్ని జీవోలు వెబ్‌సైట్లో ఉంచింది.. సీక్రెట్‌ అంటూ అప్‌లోడ్‌ చేయని జీవోల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img