నేడు ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నేతలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ, దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.