Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక సాక్షి అనుమానాస్పద మృతి

గతంలో ప్రాణహాని ఉందన్న గంగాధర్‌ రెడ్డి
అనుమానాస్పద మరణంగా కేసు ఫైల్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్‌ రెడ్డి (49) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన చనిపోయారు. గంగాధర్‌ రెడ్డి నిద్రపోయిన సమయంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వారు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి గంగాధర్‌ రెడ్డి మృతదేహాన్ని తరలించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటికే మూడుసార్లు గంగాధర్‌రెడ్డిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో క్లూస్‌ టీమ్‌ కూడా రంగంలోకి దిగింది.. ఆ ఇంటి పరిసరాలను పరిశీలించింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి గంగాధర్‌రెడ్డి అనుచరుడుగా ఉన్నారు. గంగాధర్‌ రెడ్డి స్వగ్రామం పులివెందుల కాగా.. పదేళ్ల క్రితం యాడికికి మకాం మార్చారు. తనకు ప్రాణముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని రెండుసార్లు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ గతంలో చెప్పారు. గతేడాది అక్టోబర్‌ 2న వివేకా హత్య కేసులో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసును తనపై వేసుకుంటే రూ.10కోట్లు ఇస్తానని శివశంకర్‌రెడ్డి చెప్పినట్లు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో గంగాధర్‌రెడ్డి అన్నారు. కానీ మెజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు.. ఆ తర్వాత సీబీఐ అధికారులపైనే అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img