శ్రీశైలంలోని అన్నదాన భవన సముదాయంలో పెను ప్రమాదం తప్పింది. మల్లికార్జున స్వామి దేవాలయం వంటగదిలో మంగళవారంనాడు బాయిలర్ పేలింది. దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టిఫిన్ తయారీకి ఉపయోగించే వంటగదిలోని స్టీమ్ వాటర్ బాయిలర్ పేలింది. పెద్ద శబ్దంతో పేలుడు చోటుచేసుకోవడంతో సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు.నిత్య అన్నదానం బయటవైపు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు బాయిలర్ పేలుడుకు కారణలేంటని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.