Friday, April 26, 2024
Friday, April 26, 2024

సమస్యను జఠిలం చేసుకోవద్దు : సజ్జల

కరోనా నేపథ్యంలో ఆందోళన వద్దని..ఒక విధంగా ఉద్యోగులు రేపు చేసేది బల ప్రయోగం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పీఆర్సీ సాధన కోసం రేపు ఉద్యోగులు ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియా సమావేశంలో మాట్లాడారు. సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని.. మీరు చెప్పే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ‘‘సమ్మె అవసరం లేకుండా సమస్య పరిష్కారం చేద్దామని చెప్పాం. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ పైనే పట్టుబడుతున్నాయి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యలను జఠిలం చేసుకోవద్దని చెప్పాం. కరోనా నేపథ్యంలో ఆందోళన వద్దని’’ సజ్జల విజ్ఞప్తి చేశారు. కొత్త పీఆర్సీతో ఎవ్వరి జీతాలు తగ్గలేదని.. ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని కోరారు. ‘సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు?. ఉద్యోగుల కార్యాచరణను పక్కన పెట్టాలని చెప్పాం. సమ్మెకు వెళ్లకముందే రోడ్డు ఎక్కడం సరికాదు’ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img