బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్ హెడ్ వరుణ్ మాలి, పలువురు బృంద సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్ టీంను కోరారు. అనంతరం సీఎం జగన్.. డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ను సన్మానించి, జ్ఞాపిక అందజేశారు.