వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ చీఫ్కు ఎంపీ రఘురామకృష్ణరాజు శనివారం లేఖ రాశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని రఘురామ లేఖలో కోరారు. ఈ కేసులో ఆలస్యం జరిగితే నిందితులు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. జైల్లో, జైలు బయట ఉన్న నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని కోరారు. ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించాలని కోరారు.