Friday, April 26, 2024
Friday, April 26, 2024

సూర్యలంక బీచ్‌ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు

బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ లో గల్లంతైన ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బీచ్‌ లో విహారానికి వెళ్లి విజయవాడ సింగ్‌ నగర్‌కు చెందిన యువకులు మృతి చెందిన ఘటన తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.
మృతులంతా పేద కుటుంబాలకు చెందినవారని పేర్కొన్నారు. చేతికి అందివస్తారనుకున్న పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబాలకు అపార నష్టం జరిగిందని వివరించారు. పండుగవేళ బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు వెల్లడిరచారు. పర్యాటక కేంద్రాల వద్ద ప్రభుత్వం తగు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే, మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img