Friday, April 26, 2024
Friday, April 26, 2024

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ సలహాదారునిగా జయప్రకాశ్‌సాయి..

అభినందించిన మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌.. విజయవాడకు సలహాదారునిగా డా. జే జయప్రకాశ్‌సాయి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రతిపాదనను పరిశీలించాక ఈ నిర్ణయం తీసుకుంది. వేతనం లేకుండా స్వచ్ఛంద సేవా ప్రాతిపదికన రెండేళ్ల పాటు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ విజయవాడకు సలహాదారుగా జయప్రకాశ్‌సాయి సేవలందించనున్నారు.నీరు, పారిశుధ్యం కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ కి ఆయన సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా వివిధ శాఖలు, ఎన్‌జిఓలు, కెపాసిటీ బిల్డింగ్‌ ప్రోగ్రామ్‌, మెడికల్‌ రంగాలల్లో డాక్టర్‌ జయప్రకాశ్‌ సాయికి విశేష అనుభవం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాల్‌ కృష్ణ ద్వివేది ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా , స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ సలహాదారుగా నియమించడం పట్ల జయప్రకాశ్‌సాయి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img