హోం మంత్రి సుచరిత పిలుపు
స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని హోం మంత్రి సుచరిత పిలుపునిచ్చారు.పాకిస్తాన్పై భారత్ విజయానికి సూచికగా చేపట్టిన స్వర్ణ విజయ్ వర్ష్ జ్యోతిని శుక్రవారం ఆర్కే బీచ్లోని విక్టరీ ఎట్ సీ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తూర్పు నౌకదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజెంద్ర బహుదుర్ హోంమంత్రికి అందజేశారు. నాటి విజయంలో భాగస్వాములైన నేవీ సిబ్బందిని మంత్రి సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,మాజీ సైనికులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రక్షణ శాఖ మాజీ ఉద్యోగులకు రాయితీ ద్వారా పరిశ్రమలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం జగన్్డ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.