రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే కృష్ణా, పశ్చిమ గోదావరి, చిత్తూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో పలు పాఠశాల్లో విద్యార్థులు,ఉపాధ్యాయులు కోవిడ్ బారినపడ్డారు. తాజాగా కృష్ణా జిల్లా ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు,సైన్స్ అసిస్టెంట్కి కరోనా పాజిటివ్గా తేలింది.బాధితులకు ప్రభుత్వ వైద్యులు మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.స్కూల్ మొత్తం శానిటైజ్ చేసి.. మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.