Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

22న కుప్పం వస్తున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 22న ఆయన కుప్పం రానున్నారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైనట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి రానుండడంతో ఎమ్మెల్సీ భరత్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు హెలీప్యాడ్‌ కోసం స్థలాలను పరిశీలించారు. కాగా, విపక్షనేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోకి సీఎం వస్తుండడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిరది. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడం తెలిసిందే. 2024 ఎన్నికల్లో కుప్పం స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలన్నది వైసీపీ ప్రణాళికల్లో ముఖ్యమైనదిగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img