Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

6 కోట్ల రూపాయల విలువచేసే సెల్‌ ఫోన్లు రికవరీ

అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్‌.పక్కీరప్ప
విశాలాంధ్ర`ఉరవకొండ : అనంతపురం జిల్లాలో చోరీకి గురైన దాదాపు 6 కోట్ల రూపాయలు విలువ చేసే 3575 సెల్ఫోన్లను రికవరీ చేశామని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్‌ పక్కీరప్ప తెలిపారు. శుక్రవారం ఉరవకొండ పోలీస్స్టేషన్‌ ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రికవరీ చేసిన సెల్‌ ఫోన్లను ప్రతి సోమవారము గ్రీవెన్స్‌ సెల్‌ నందు బాధితులకు అందజేయడం జరుగుతుందన్నారు.జిల్లాలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి పోలీస్‌,రెవెన్యూ వ్యవసాయ శాఖ మండల స్థాయి అధికారులతో త్రీ మెన్‌ కమిటీని నియమించడం జరిగిందని ఈ కమిటీ నిర్ధారించిన తర్వాత ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరుగుతుందన్నారు రైతుల ఆత్మహత్యల నివారణకు కౌన్సిలింగ్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలు మందులు ఎరువులు, అమ్మకాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు త్వరలోనే జిల్లాలో అనంత ఈగల్‌ యాప్‌ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ యాప్‌ లో రోడ్డు ప్రమాదాలు మరియు రోడ్డు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న అంశాలకు సంబంధించి ఫోటోలు అప్లోడ్‌ చేయవచ్చని పంపించిన వారి వివరాలు గోప్యంగా కూడా ఉంచడం జరుగుతుందన్నారు జిల్లాలో పెండిరగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఉరవకొండ అర్బన్‌ సీఐ హరినాథ్‌ పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img