Friday, April 26, 2024
Friday, April 26, 2024

భూమా అఖిలప్రియకు బెయిల్

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కర్నూలు కోర్టులో ఊరట లభించింది. మరో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం అఖిలప్రియ కర్నూలు మహిళా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ లభించడంతో ఆమె సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img