Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

సీఎం జగన్ పై రాయి దాడి కేసు: నిందితుడి కస్టడీ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా

సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నిందితుడిని కస్టడీకి కోరుతూ పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. నిందితుడ్ని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ముగిసింది. నిందితుడి తరఫు న్యాయవాది సలీం కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం పూర్తి తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img