Friday, May 3, 2024
Friday, May 3, 2024

అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు

రహదారి గుంతల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై పవన్‌కళ్యాణ్‌ సెటైర్‌
రోడ్ల పరిస్థితిపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు. అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు ఏపీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. రోడ్లపై గుంతలు పూడిస్తే కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌ హైదర్షాకోట్‌ దగ్గర ఉండే కాట్నం బాలగంగాధర్‌ తిలక్‌ దేశంలోని చాలా చోట్ల తన సొంత డబ్బుతో ఇప్పటి వరకు 2100 గుంతలను పూడ్చాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోనూ రహదారి గుంతలను పూడ్చేందుకు వెళ్లగా పోలీసులు తనపై కేసులు పెడతామంటూ వేధిస్తున్నారని ఆయన తాజాగా ఆరోపించారు. ఈ విషయాన్ని పవన్‌ ప్రస్తావిస్తూ పవన్‌కళ్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే ఉంది. రూ.5వేల కోట్ల రహదారి నిధుల మళ్లించేశారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img