Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఉమ దేవినేని ఉమ నిరసన

అమరావతిలోని గొల్లపూడిలో టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ రహదారిపై దేవినేని ఉమ బస్సులు ఆపి నిరసన తెలిపారు. ‘టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పిలుపు మేరకు ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్‌ జగన్‌ ‘‘బాదుడే బాదుడు’’ కార్యక్రమాలపై బస్సులో ప్రయాణికులకు, ప్రజలకు అవగాహన కల్పించేలా వివరిస్తూ పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని గొల్లపూడిలో నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని దేవినేని ఉమ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img