Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఉద్యోగుల సమ్మె విషయం మా దృష్టికి రాలేదు : మంత్రి పేర్ని నాని

ప్రభుత్వ ఉద్యోగుల సహాయనిరాకరణ అంశం ప్రభుత్వం దృష్టికి రాలేదని మంత్రి స్పష్టంచేశారు. కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడిరచిన అనంతరం ఉద్యోగుల సమ్మెపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిచారు. ఉద్యోగులతో మాట్లాడేందుకు సీఎస్‌, ప్రభుత్వ సలహాదారు, ముగ్గురు మంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అసభ్యంగా మాట్లాడితే హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుందా అని ప్రశ్నించారు. ఏదైనా న్యాయంగా పోరాటం చేస్తేనే సాధించగలుగుతామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img