Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఏపీ ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను గురువారం వెల్లడిరచింది. ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు జరగనున్నాయి. విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్సాల్సి ఉంది. కాగా జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను మొత్తం వాయిదా వేయాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. కాగా ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మాత్రం యధావిధిగా మార్చి 11 నుంచి 31 వరకు జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img