ఒంగోలు ఆర్టీఏ అధికారుల తీరుపై మండిపాటు
ఒంగోలు ఆర్టీఏ అధికారుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు…సీఎం జగన్ కాన్వాయ్ కోసం తిరుమల వెళ్లే భక్తుల కారును లాక్కెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో నెలకొన్న దౌర్భాగ్య పాలనకు ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కాన్వాయ్ కోసం ప్రజల కారును తీసుకెళ్లే స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లిందని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులే ఇటువంటి చర్యలకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.