Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

రన్‌ వేపై నిలిచిపోయిన విమానం

గన్నవరం విమానాశ్రయంలో రన్‌ వే మీదే విమానం నిలిచిపోయింది. గన్నవరం నుండి 117 మంది ప్రయాణికులతో ఢల్లీి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం గంటల తరబడి రన్‌ వే మీదే నిలిచిపోయింది. ప్రయాణికులందర్నీ గన్నవరం విమానాశ్రయంలో ఉంచి విమానంలో సాంకేతిక లోపాన్ని సరిచేస్తున్నారు. ఈ విమానం ఉదయం 07.00 గం. లకు దిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయంకు చేరుకుంది. తిరుగు ప్రయాణం సమయంలో సాంకేతిక కారణాల వల్ల రన్‌ వే మీదే ఆగిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img