ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని ఓ విద్యాసంస్థలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో 11 మందికి పాజిటివ్గా తేలింది. ఇక్కడ చదువుతున్న 10 మంది విద్యార్థులు, డైనింగ్ హాల్ నిర్వహించే ఓ వ్యక్తికి పాజిటివ్గా నిర్థారణయ్యింది. దీంతో వైద్య బృందం వెళ్లి వైద్య సేవలు అందించినట్లు కురబలకోట పీహెచ్సీ వైద్యాధికారిణి తెలిపారు.