Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

దళితులంతా కలిసికట్టుగా జగన్‌కు అండగా నిలబడాలి

మంత్రి ఆదిమూలపు సురేష్‌
దళితులంతా కలిసికట్టుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అండగా నిలబడదామంటూ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పిలుపునిచ్చారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్‌ అని ఆయన అన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో మంగళవారం జరిగిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దళితుల కోసం సీఎం జగన్‌ తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ప్రతిపక్షాలకు కడుపు మండుతోందని, అందుకే వాటిని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దళితులపైన చంద్రబాబుకు చులకన భావన ఉందని, అయితే దళితుల ఓట్లు మాత్రం కావాలనే నీచమైన ఆలోచనతో దళితులకు ద్రోహం చేశారని అన్నారు. బీజేపీ నేతలు తమ స్వార్థం కోసం దళితుల ఓటు బ్యాంకు కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img