Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే అధికారులు జారీ చేసిన మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 21.60 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ నుంచి పంట కాల్వలకు 10,500 క్యూసెక్కుల నీటిని, సముద్రంలోకి 23.94 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 175 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img