ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ రాజ్భవన్కు చేరుకున్నారు.ఇటీవల కాలంలో ఆయన ఢల్లీి పర్యటనతోపాటు పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చారు.అనంతరం ఈనెల 15న కరోనావైరస్ బారిన పడిన గవర్నర్ బిశ్వభూషణ్.. హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.