Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి : చినరాజప్ప

డ్రగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వదిలి.. ధూళిపాళ్లకు పోలీసులు ఎలా నోటీసులు ఇస్తారని టీడీపీ నేత, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. ప్రజల పక్షాన ఉండే ప్రతిపక్షాల నోరు నొక్కే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభం కాక ముందే డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదని వైసీపీ నేతలు అంటున్నారని విమర్శించారు.నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతలను భయబ్రాంతులకు గురి చేయడానికే ఇలాంటి నోటీసులు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజల అందరూ డ్రగ్స్‌ గురించే మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img