మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి
తిరుపతి, తిరుమలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతుండడం చూస్తుంటే మనసును కలిచివేస్తోందని తన ట్విట్టర్ ఖాతాలో తిరుపతి, తిరుమల పరిస్థితులపై ట్వీట్ చేశారు. రాష్ట్రప్రభుత్వం, టీటీడీలు కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పక్షాలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నా అని ట్వీట్ చేశారు.