రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు ఆగమనాన్ని తెలియజేసే విధంగా హోలీని దేశవ్యాప్తంగా ఆనందంగా, ఉల్లాసంగా జరుపుకుంటారని సీఎం పేర్కొన్నారు. ‘‘ఇంద్ర ధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.