Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

సీపీఐ రాష్ట్ర మహాసభల విజయవంతానికి
రూ. 50 వేల విరాళం

విశాలాంధ్ర`విశాఖపట్నం: నగరంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న సీపీఐ రాష్ట్ర 27 మహాసభలు విజయవంతం కావాలని విశాఖ పట్నం కోపరేటివ్‌ బ్యాంక్‌లో ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన కె నరేంద్ర రావు, ఎం అరుణ దంపతులు ఆకాంక్షించారు. మహాసభల విజయవతం కోసం తమ కుటుంబం తరపున రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మహాసభల ఆహ్వాస సంఘం ప్రధాన కార్యదర్శి జేవీ సత్యనారాయణను కలసి రూ. 50 వేల విరా ళాన్ని అందించారు. ఈ సందర్భంగా జేవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర మహాసభలకు వివిధ వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ సహకారం అందుతోందని చెప్పారు. తమ వంతు బాధ్యతగా పార్టీ మహాసభలకు ఆర్థిక సహకారం అందించిన కె.నరేంద్ర రావు, ఎం అరుణ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమలో సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img