Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

హైదరాబాద్‌లో ఐడీబీ ఎడ్యుకేషన్‌ 3వ కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్‌: అంతర్జాతీయ విద్యా సేవల్లో గ్లోబల్‌ లీడర్‌ ఐడీబీ ఎడ్యుకేషన్‌, తెలంగాణలోని హైదరాబాద్‌లో తన మూడవ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా దక్షిణ భారతదేశంలో తన పరిధిని మరింతగా పెంచుకుంది. ఈ విస్తరణ ఐడీబీ ఉనికిని 61 నగరాల్లో విస్తరించి ఉన్న 70 కార్యాలయాలకు తీసుకువెళ్లింది, ఇది అంతర్జాతీయ విద్యా పరిశ్రమలో భారతదేశం అంతటా గరిష్ట సంఖ్యలో భౌతిక ఉనికికి దారితీసింది. కొత్తగా ప్రారంభించబడిన కార్యాలయం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌ వంటి ప్రముఖ గమ్యస్థానాలలో ఎండ్‌-టు-ఎండ్‌ అంతర్జాతీయ విద్యా సేవలను పొందేందుకు కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌, నాగోల్‌, ఉప్పల్‌, హబ్సిగూడలో నివసించే ప్రజలకు అత్యంత సమీపంలో ఉంటుందని ఐడీపీ ఎడ్యుకేషన్‌ దక్షిణాసియా, మారిషస్‌ రీజినల్‌ డైరెక్టర్‌ పీయూష్‌ కుమార్‌ అన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2022లో 1.3 మిలియన్లకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img