విజయవాడ: అగ్రగామి ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ తమ నూతనంగా డిజైన్ చేసిన షోరూమ్ను ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రారంభించింది. ఇది ఎంజీరోడ్, పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ ఎదురుగా ఉంది. ఈ పూర్తి సరికొత్త షోరూమ్ అత్యంత విలాసవంతమైన, పునరుద్ధరించబడిన షాపింగ్ అనుభవాలను వైవిధ్యమైన, ట్రెండీ ఆభరణాల డిజైన్లను ప్రదర్శించడం ద్వారా అందిస్తుంది. ఈ షోరూమ్ పునః ప్రారంభంతో, ఈ జ్యువెలరీ బ్రాండ్ వినూత్నమైన నేపథ్యం-స్పెషల్ ముహూర్త్ లాంజ్ను పరిచయం చేసింది. వెడ్డింగ్ షాపర్ల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సేవలను సైతం ఈ షోరూమ్లో అందిస్తున్నారు. ఈ పూర్తి సరికొత్త షోరూమ్లో విస్తృత శ్రేణిలో ఆభరణాలను కళ్యాణ్ జ్యువెలర్స్ కలెక్షన్స్ నుంచి అందిస్తున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ నేటి నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఇక్కడ విస్తృత శ్రేణిలో సమకాలీన, సంప్రదాయ డిజైన్లు ప్రతి వినియోగదారుని అభిరుచి, ప్రాధాన్యతలకు అనుగుణంగా అందిస్తుందని కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ తెలిపారు.