విశాలాంధ్ర/హైదరాబాద్: విశాఖపట్నానికి చెందిన కామేశ్వరి జ్యుయలర్స్ ముత్యాల నగరమైన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో అత్యాధునిక జ్యుయలరీ స్టోర్ను ప్రారంభించింది. ఆగస్టు 4 ఉదయం 8.21 గంటలకు ఈ స్టోర్ ప్రారంభమైంది. కామేశ్వరి జ్యుయలర్స్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ పార్ట్ నర్ పెర్ల సాంబమూర్తితో పాటుగా కామేశ్వరి జ్యుయలర్స్ పార్ట్నర్ కౌశిక్ పేర్ల, పవన్ పేర్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేర్ల కుటుంబానికి చెందిన సురేఖ, స్వాతి, సంహిత కూడా ఇందులో పాల్గొన్నారు. యాజమాన్యానికి, కామేశ్వరి జ్యుయలర్స్ వృద్ధి వ్యూహానికి వారు అండగా ఉంటున్నారు. 1984లో పెర్ల సాంబమూర్తి ప్రారంభించిన కామేశ్వరి జ్యుయలర్స్ తన మొదటి అవుట్లెట్ను శ్రీకాకుళంలో ప్రారంభించింది. ఆ తర్వాత విశాఖపట్నంలో మొదటి ఫుల్లీ ఎయిర్ కండీషన్డ్ జ్యుయలరీ స్టోర్ను 1994లో ప్రారంభించారు. నాటి నుంచి కామేశ్వరి జ్యుయలర్స్ అన్ని రకాల ఫైన్ జ్యుయలరీకి ప్రాధాన్య ఎంపికగా మారింది.