బెంగళూరు: హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ మంగళవారంనాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి ) బెంగళూరుతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. అవగాహన ఒప్పందం ప్రకారం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్, ఐఐఎస్సి బెంగళూరులోని బాగ్చి-పార్థసారథి హాస్పిటల్ మూడు విభాగాలకు మద్దతు ఇవ్వడానికి రూ.107.76 కోట్లను ప్రతిజ్ఞ చేసింది. కార్డియాలజీ వింగ్, రేడియాలజీ వింగ్, ఎమర్జెన్సీ మెడిసిన్ వింగ్ అనే మూడు విభాగాలకు బ్యాంక్ మద్దతు ఇవ్వబోతోంది. ఐఐఎస్సి బెంగుళూరు తన క్యాంపస్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్కూల్తో పాటు లాభాపేక్ష లేని 832 పడకల బహుళ-స్పెషాలిటీ బాగ్చీ-పార్థసారథి హాస్పిటల్ని ఏర్పాటు చేస్తోంది. ఆసుపత్రి 2024 చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని అంచనా.