హైదరాబాద్: స్మార్ట్ఫోన్ బ్రాండ్ శాంసంగ్, ఇప్పుడు గెలాక్సీ 5జీ ప్రచారం ప్రారంభించడంతో పాటుగా పండుగ సీజన్ కోసం అతిపెద్ద 5జీ ఉత్పత్తుల జాబితాతో తమ 5జీ వాగ్ధానాన్ని బలోపేతం చేసింది. ఈ తాజా శ్రేణి గెలాక్సీ 5జీ స్మార్ట్ఫోన్లను శక్తివంతమైన ఆవిష్కరణలు విస్తృతశ్రేణిలో అభిమానులకు అందుబాటులో ఉండే రీతిలో ఆవిష్కరించారు. గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్ఫోన్లు శాంసంగ్ డాట్కామ్, ఫ్లిప్కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల వద్ద 20,999 రూపాయలకు లభ్యమవుతుందని శాంసంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ అన్నారు.