హైదరాబాద్ : దేశంలో నం.1 స్మార్ట్ఫోన్, స్మార్ట్ టీవీ బ్రాండ్ షవోమీ తన ప్రీమియం శ్రేణి ‘ఎంఐ’ సిరీస్ ఉత్పత్తులను ఇప్పుడు కొత్త లాంఛనం ‘షవోమీ’తో మార్చివేస్తోంది. తన కొత్త బ్రాండ్ గుర్తును పరిచయం చేయడంతో పాటు తన బేసిక్ కార్పొరేట్ బ్రాండ్లో భాగంగా రెండు ప్రత్యేక ఉత్పత్తి శ్రేణిని కలిగి ఉంటుంది. ఈ రెండు ప్రత్యేక ఉత్పత్తి ఉప-బ్రాండ్లను ఇప్పుడు వరుసగా ‘షవోమీ’, ‘రెడ్మి’గా పిలువనున్నారు. కార్పొరేట్ బ్రాండ్ ‘ఎంఐ’ లాంఛనం కానున్నది. షావోమీ బ్రాండ్కు ‘ఎంఐ’ టైపోగ్రఫీతో రీడిజైన్ చేశారు. గత ‘ఎంఐ’ బ్రాండ్ సాంకేతికత శిఖరానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. దీన్ని ఇప్పుడు ‘షవోమి’ సిరిస్గా రీ బ్రాండ్ కానుందని షవోమీ ఇండియా మార్కెటింగ్ విభాగాధిపతి జస్కరణ్ సింగ్ కహాని పేర్కొన్నారు.