Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆసక్తికరంగా ‘విరూపాక్ష’ ట్రైలర్‌


హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్తా మీనన్‌ కథానాయిక. కార్తిక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. గ్రామీణ వాతావరణాన్ని చూపిస్తూ ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. ‘ఊరిలో జరుగుతున్న చావులకు కారణం తెలుసుకుని తీరతాను, సమస్యకు పరిష్కారం నేను వెతుకుతాను’ అంటూ సాయితేజ్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ‘గ్రహణం నీడ పట్టి విడిచే లోపు ఊరు అంతం అయిపోతుంది… గుడిని, ఊరిని అష్టదిగ్భందనంతో మూసేయాలి…రుద్రవనాన్ని కాపాడే విరూపాక్షవి నువ్వే’ అంటూ సాగే డైలాగ్‌లు అలరించేలా ఉన్నాయి. ఉత్కంఠగా సాగే మిస్టరీ థ్రిల్లర్‌లా అనిపిస్తుంది. ఈ చిత్రంలో సునీల్‌, సాయిచంద్‌, అజయ్‌ ఇతర పాత్రల్లో నటించారు. ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img