కొత్త కంటెంట్తో పాటు.. సరికొత్త షోలను ప్రేక్షకులకు అందిస్తున్న ఎంటర్టైన్మెంట్ షో ‘ఆహా’. ఇప్పటి వరకు సమంతతో సామ్ జామ్ షోను చేయించారు. ఇక రానా నెంబర్ వన్ యారీ షో కూడా వచ్చింది. ఇప్పుడు మంచు లక్ష్మీ వంతు వచ్చింది. ఆమె ఇప్పటికే రకరకాల షోలను విజయవంతంగా నడిపించారు. ఇప్పుడు ఆహా కోసం సరికొత్త షోతో ముందుకు వస్తున్నారు. ఈ మేరకు వదిలిన ప్రోమోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.