హైదరాబాద్: ఎప్పుడెప్పుడొస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ‘బిగ్బాస్’ శుభవార్త వినిపిం చాడు. తానెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడో చెప్పేశాడు. ఇంతకాలం బుల్లితెరపై సందడి చేయగా ఇప్పుడు 24/7 వినోదం అందించడానికి ఓటీటీలోకి రాబోతు న్నాడు. ‘బిగ్బాస్ నాన్స్టాప్’ పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహ రిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ‘డిస్నీ హాట్స్టార్’ ఓటీటీలో ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ నాగార్జున ప్రోమో వీడియోను పంచుకున్నారు. ఇందులో.. ఉరిశిక్ష ఖరారైన ఖైదీ తన చివరి కోరికగా బిగ్బాస్కి సంబంధించి ఒక్క ఎపిసోడ్ను చూడాలను కుంటాడు. తన కోరిక మేరకు ఈ షోను ప్రసారం చేయగా అది ఎంతకీ పూర్తవదు. ఉరిశిక్ష పడిన ఖైదీగా వెన్నెల కిశోర్, పోలీసు అధికారిగా మురళీశర్మ, లాయరుగా నాగార్జున అలరించారు. ఈ ‘బిగ్బాస్ నాన్-స్టాప్’ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.