హైదరాబాద్: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటతో భారతీయ సినిమా గర్వపడేలా చేశారు కీరవాణి, చంద్రబోస్. ఈ పాట ఆస్కార్కు నామినేట్ అవ్వడంపై సినీ ప్రియులంతా ఆనందంతో ఉన్నారు. తాజాగా ఆస్కార్ కమిటీ ఏర్పాటు చేసిన ‘లంచ్ మీట్’కు వీరిద్దరూ హాజరయ్యారు. అక్కడకు వచ్చిన హాలీవుడ్ ప్రముఖులతో ఫొటోలు దిగి వాటిని అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ను కలిసిన చంద్రబోస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని పేర్కొన్నారు. ‘టాప్ గన్తో’ అంటూ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ఇక ఆస్కార్ అవార్డ్స్ వేడుక మార్చిలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ముందు అమెరికాలోని కాలిఫోర్నియాలో విందు ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు 200 మంది ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. అక్కడకు వచ్చిన హాలీవుడ్ దర్శకుడు స్పీల్బర్గ్తో కీరవాణి, చంద్రబోస్ సమయం గడిపారు.