హైదరాబాద్: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, ప్రీ ల్యూడ్, గ్లింప్స్ పేరుతో చేసిన ప్రమోషన్తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘రాధేశ్యామ్’కు సంబంధించి తాజాగా ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది… సినిమా ఫస్ట్ సింగిల్ గురించి! ఈ నెల 15న ‘రాధేశ్యామ్’ నుంచి ఫస్ట్ సింగిల్ను విడుదల చేయనున్నారట మేకర్స్. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన తొలి పాట ఎలా ఉండబోతోందోనని అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.