హైదరాబాద్: ఈ వారం ఓటీటీ వేదిక పై భారీ చిత్రాలు సందడ చేయనున్నాయి. విజయ్ హీరోగా రూపొందిన ‘వరిసు’ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీ నుంచి ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ నెల 23వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ‘వీరసింహా రెడ్డి’ స్ట్రీమింగ్ కానుంది. జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో బాలకృష్ణ జోడీగా శ్రుతి హాసన్ నటించింది. కథాకథనాల పరంగా, పాటల పరంగా, డైలాగ్స్ పరంగా ఆకట్టుకున్న ఈ సినిమా, చాలా వేగంగా రూ.100 కోట్ల మార్క్ను టచ్ చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఈ సినిమాకి హైలైట్గా నిలిచింది. సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయకోడి రూపొందించిన ‘మైఖేల్’ ఈ నెల 3వ తేదీనే థియేటర్స్కి వచ్చింది. దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయిల స్పందన రాలేదు. ఈ సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఇక జనవరి 13న థియేటర్స్ కి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమా ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది.