విశాలాంధ్ర ,సీతానగరం: మండలంలోని జోగమ్మపేటలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అధ్యక్షులు తట్టికోట గౌరు నాయుడు అధ్యక్షతన జరిగిన మండల కౌన్సిల్ సమావేశంలో సీతానగరం మండల ఏపీటిఎఫ్ శాఖ నూతన అధ్యక్షులుగా పోల సత్యనారాయణ, ప్రధానకార్యదర్శిగా సల్లా సత్యం నాయుడులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఎన్నికలఅధికారిగాఏపీటిఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ దాసరి వెంకటనాయుడు, ఎన్నికల పరిశీలికులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చుక్క శ్రీదేవిలు పాల్గొని ఎన్నికలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు మరడాన శివునాయుడు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.