ఎయిర్ ఇండియాపై వచ్చిన కథనాలను ఖండిరచిన ప్రభుత్వం
దేశీయ విమాన దిగ్గజమైన ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ తుది బిడ్ను గెలుచుకుందని మీడియాలో వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండిరచింది.భారీనష్టాల్లో ఉన్న ఎయిర్ఇండియాను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా..టాటాసన్స్ విజయవంతమైన బిడ్డర్గా ఎంపిక చేసినట్లు ప్రముఖ వాణిజ్య పత్రిక బుల్బెర్గ్ తెలిపింది. కానీ ఈ ప్రచారంపై ప్రభుత్వం స్పందిస్తూ, బిడ్డింగ్లో టాటా గ్రూపు విజయం సాధించినట్లు వచ్చిన కథనాలు సరికాదని పేర్కొంది. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణలో ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించిందన్న మీడియా వార్తల్లో నిజం లేదు అని ఆర్థిక శాఖ ఒక ట్వీట్లో వెల్లడిరచింది. దీనిపై నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం.. మీడియాకు వెల్లడిస్తుందని స్పష్టం చేసింది.