మూడేళ్ల నిరీక్షణ తర్వాత జపాన్ రాకుమారి మాకో ఎట్టకేలకు తన ప్రేమను గెలిపించుకుని ప్రియుడు కీ కొమురోను పెళ్లాడిరది. రాచరికాన్ని, కోట్లాది రూపాయల రాజభరణాన్ని తృణప్రాయంగా వదులుకుని సామాన్యుడి ఇంట కోడలిగా అడుగుపెట్టింది. మాకో, కొమురో వివాహ పత్రాన్ని పాలెస్ అధికారులు ఇవాళ ఉదయం సమర్పించినట్లు ఇంపీరియల్ హౌజ్హోల్డ్ ఏజెన్సీ వెల్లడిరచింది. వివాహానికి సంబంధించి ఎలాంటి విందులు, ఆచారాలు ఉండవని వెల్లడిరచింది. వీరి వివాహానికి మెజార్టీ ప్రజలు వ్యతిరేకత రావడంతో ప్యాలెస్లో ఎలాంటి వేడుకలను నిర్వహించలేదు. సంప్రదాయం ప్రకారం వీడ్కోలు కూడా ప్రకటించారు.
జపాన్ చక్రవర్తి నరుహిటో సోదరుడు ప్రిన్స్ అఖిషినో కూతురే మాకో. మాకో టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీ నుంచి 2014లో కళలు, సాంస్కృతిక వారసత్వంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్ వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ లీసిస్టర్స్ నుంచి మ్యూజియాలజీలో మాస్టర్స్ పట్టా అందుకున్నారు. అయితే ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే కొమురో పరిచయం అయ్యారు.ఇద్దరూ ఒకరినొకరూ ఇష్టపడ్డారు. 2017లో తమ ప్రేమ విషయాన్ని మాకో అధికారికంగా ప్రకటించారు. అదే ఏడాది సెప్టెంబర్లో మాకో, కొమురోకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఇంపీరియల్ హౌజ్హోల్ట్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. 2018, నవంబర్లో వీరిద్దరి వివాహం జరుగుతుందని తెలిపింది. అయితే కొమురో తల్లి కారణంగా తలెత్తిన ఆర్థిక వివాదాలతో ఈ పెళ్లి అప్పట్లో రద్దయింది. దీంతో 2018లో కొమురో లా చదివేందుకు న్యూయార్క్ వెళ్లిపోయారు. ఆ తర్వాత మూడేళ్లపాటు కొమురో జపాన్ వైపు తిరిగి చూడలేదు. గత నెల చదువు పూర్తిచేసుకుని కొమురో స్వదేశానికి తిరిగి వచ్చారు. దీంతో ఈ జంట మళ్లీ పెళ్లి ప్రతిపాదన తేగా ఆర్థిక వివాదంపై స్పష్టత ఇవ్వాలని మకో తండ్రి కొమురోను అడగగా, దీనిపై ఆయన లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించారు. చివరకు ఇప్పుడు వివాహం పూర్తయింది. జపాన్ యువరాణులు సామాన్య కుటుంబానికి చెందిన యువకులను పెళ్లాడితే.. రాచరికపు హోదాను మాత్రమే కాకుండా, సంప్రదాయం ప్రకారం రాచ కుటుంబం నుంచి బహుమతిగా వచ్చే సుమారు రూ. 9 కోట్లను మాకో తిరస్కరించింది.