న్యూదిల్లీ : ఈ పండుగ సీజన్లో వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా వంటనూనెల హోల్సేల్ ధరలను 3 నుంచి 5వేల రూపాయల మేర తగ్గించాలని పరిశ్రమల సంఘం సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సోమవారం తెలిపింది. ఈ మేరకు సంఘ సభ్యులు నిర్ణయించినట్లు వెల్లడిరచింది. ప్రభుత్వ చర్యల కారణంగా అక్టోబర్ 1న కిలోకు రూ.169.6గా ఉన్న పామాయిల్ సగటు రిటైల్ ధరలు అక్టోబర్ 31న రూ.132.98 కి అంటే 21.59 శాతం తగ్గినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. ఇదే సమయంలో సోయా నూనె సగటు రిటైల్ ధర కిలోకు రూ.155.65 నుంచి రూ.153కి స్వల్పంగా తగ్గింది. అయితే వేరుశనగ నూనె, ఆవాల నూనె, పొద్దుతిరుగుడు నూనె సగటు రిటైల్ ధరలు అక్టోబరు 31న వరుసగా కిలో రూ.181.97, రూ.184.99, రూ.168 వద్ద స్థిరంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ గణాంకాలు వివరించాయి. కాగా దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని టన్నుకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు వంట నూనెల ధరలను తగ్గించాలని నిర్ణయించినట్లు ఎస్ఈఏ తెలిపింది. ఎస్ఈఏ సభ్యులు అధిక పన్ను చెల్లించిన నిల్వలతో సతమతమవుతున్నప్పటికీ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా విక్రయ ధరలను తగ్గిస్తున్నాయని ఎస్ఈఏ ఒక ప్రకటనలో తెలిపింది. వంట నూనెల ధరలను తగ్గించడానికి అక్టోబర్ రెండవ వారంలో దిగుమతి సుంకాల తగ్గింపు సహా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇది ధరలను నియంత్రించడంలో సహాయపడిరది. ఇప్పుడు దేశీయ హోల్సేల్ రేట్లలో ప్రతిబింబిస్తుందని పేర్కొంది.