Friday, April 26, 2024
Friday, April 26, 2024

అంతకంతకూ పెరుగుతున్న కరోనా ఉధృతి

దేశవ్యాప్తంగా 3,47,254 పాజిటివ్‌ కేసులు
దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనాతో మరో 703 మంది మరణించారు. వైరస్‌ నుంచి 2,51,777 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.తాజా కేసులుతో మొత్తం కేసులు సంఖ్యం 3,85,66,027 చేరింది. మొత్తం మరణాలు 4,88,396కు చేరాయి. దేశంలో ప్రస్తుతం 20,18,825 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య కూడా పెరుగుతున్నాయి. మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 9,692కి చేరాయి. భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 70,49,779 డోసులు ఇచ్చారు. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 1,60,43,70,484 డోసులు వేశారు. గురువారం రోజు దేశవ్యాప్తంగా 19,35,912 కరోనా టెస్టులు నిర్వహించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 71.15 కోట్లకు చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img